శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం వెబ్సైట్ ఆవిష్కరణ
- April 28, 2026
గూడూరు: శిర్డీ సాయి భక్తులకు ఆనందాన్ని కలిగించే విశేష సంఘటనగా, శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం అధికారిక వెబ్సైట్ను పూజ్య మాతాజీ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గురు గురురాం రతంజీ పుణ్య తిథి సందర్భంగా భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది.
ఈ సందర్భంగా మాతాజీ మాట్లాడుతూ, శిర్డీ సాయి సందేశాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఈ వెబ్సైట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భక్తులు మహాస్తూపం నిర్మాణ పురోగతి, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల గురించి తాజా సమాచారాన్ని సులభంగా పొందేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు.
కార్యక్రమంలో అనేక మంది భక్తులు, శిష్యులు పాల్గొని గురు రాం రతంజీ సేవలను స్మరించుకున్నారు.
ఈ వెబ్సైట్ ద్వారా ప్రపంచ నలుమూలల భక్తులు ఒకే వేదిక పైకి చేరి సాయి తత్వాన్ని అనుసరించేందుకు ప్రేరణ పొందుతారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
వెబ్సైటు లింక్ కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
https://shirdisaishatabdimahastupam.com/
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







