చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- April 28, 2026
అబూదాబి: యూఏఈ ఓపెక్ (OPEC) మరియు ఓపెక్+ కూటమి నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది.ఈ నిర్ణయం 2026 మే 1 నుంచి అమల్లోకి రానుంది. దేశ దీర్ఘకాలిక వ్యూహాత్మక, ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ వెల్లడించింది.
దేశీయ ఇంధన ఉత్పత్తిలో పెట్టుబడులను వేగవంతం చేయడం, మారుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా స్పందించడం, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో బాధ్యతాయుతమైన పాత్రను కొనసాగించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
యూఏఈ ఉత్పత్తి విధానంపై సమగ్ర సమీక్ష అనంతరం, ప్రస్తుత మరియు భవిష్యత్ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుని జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గ్లోబల్ మార్కెట్ అవసరాలను సమర్థవంతంగా తీర్చడంలో ఇది సహాయపడుతుందని తెలిపారు.
ప్రస్తుతం అరేబియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో ఏర్పడుతున్న అంతరాయాలు తాత్కాలిక ప్రభావం చూపుతున్నప్పటికీ, మధ్య మరియు దీర్ఘకాలంలో గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ పెరుగుతుందని యూఏఈ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో స్థిరమైన, సరసమైన, విశ్వసనీయ ఇంధన సరఫరా అవసరాన్ని యూఏఈ పునరుద్ఘాటించింది.
1967లో అబూదాబి ద్వారా ఓపెక్లో చేరిన యూఏఈ, 1971లో దేశ ఏర్పాటుకు అనంతరం సభ్యత్వాన్ని కొనసాగించింది. ఈ కాలంలో గ్లోబల్ ఆయిల్ మార్కెట్ స్థిరత్వానికి, ఉత్పత్తిదారుల మధ్య సమన్వయానికి కీలక పాత్ర పోషించింది.
ఓపెక్ నుంచి నిష్క్రమించిన తరువాత కూడా యూఏఈ గ్లోబల్ మార్కెట్లకు బాధ్యతాయుతంగా, దశలవారీగా ఉత్పత్తిని అందిస్తుందని తెలిపింది. మార్కెట్ పరిస్థితులు, డిమాండ్కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేసింది.
తక్కువ కార్బన్ ఉద్గారాలతో, పోటీదారుల కంటే తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే దేశంగా యూఏఈ ప్రపంచ ఇంధన రంగంలో కీలక భాగస్వామిగా కొనసాగుతుందని పేర్కొంది. ఆయిల్, గ్యాస్, పునరుత్పాదక శక్తి, లో-కార్బన్ టెక్నాలజీలలో పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపింది.
ఓపెక్ మరియు ఓపెక్+తో ఐదున్నర దశాబ్దాల సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో కూడా గ్లోబల్ మార్కెట్ స్థిరత్వానికి సహకారం కొనసాగిస్తామని యూఏఈ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







