రియో ఒలింపిక్స్ లో బాంబు కలకలం
- August 06, 2016
ప్రపంచ అత్యున్నత క్రీడా సంబరాలు ప్రారంభమైన కొన్ని గంటల్లోనే రియోలో భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోపగబానా బీచ్ వద్ద బాంబు ఉందంటూ కలకలం రేగింది. అక్కడ ఓ బ్యాగ్ లో అనుమానిత పేలుడు పదార్థాలున్నాయని సిబ్బందికి సమాచారం రావడంతో ఆధునిక బాంబు చెకింగ్ రోబో స్క్వాడ్ లను రంగంలోకి దింపింది. కొద్దిసమయంలోనే బీచ్, చుట్టుపక్కల ప్రాంతాలను బ్రెజిల్ భద్రతా సిబ్బంది ఖాళీచేయించింది. రియో సంబరాలు ప్రారంభమైన మారకానా స్డేడియానికి మూడు మైళ్ల దూరంలో ఉన్న బీచ్ వాలీవాల్ ప్రాంతానికి దగ్గర్లోనే పురుషుల సైక్లింగ్ రేస్ నిర్వహిస్తారు. దీంతో సిబ్బంది వెంటనే అక్కడ తనిఖీలు చేసి ఆ బ్యాగులో పేలుడు పదార్థాలు లేవని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రదాడులు తీవ్రరూపం దాల్చిన తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్ గేమ్స్ కావడంతో బ్రెజిల్ తో పాటు కొన్ని అగ్రదేశాలు తమ దేశ అథ్లెట్ల రక్షణ కోసం చర్యలు చేపట్టాయి. ఇప్పటికే రియో పోలీసులు, దేశ ఆర్మీ బలగాలు ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచాయి. అయితే ఎఫ్ బీఐతో పాటు అమెరికా నిఘా ఏజెన్సీలు(దాదాపు 1000 మందిని ) రియోలో తమ తనిఖీలు ముమ్మరం చేసి బ్రెజిల్ సిబ్బందికి సహకరిస్తున్నాయి.తమ దేశం నుంచి మరికొంత మంది సిబ్బంది సెక్యూరిటీ కోసం బయలుదేరారని అమెరికా నిఘా అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మరోవైపు తమ దేశంలో ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడంపై కొందరు నిరసనకారులు ఆగ్రహించి బ్రెజిల్ జాతీయ పతాకాన్ని దహనం చేసి తమ నిరసన తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







