భారత్ లో ఉగ్రవాద సానుభూతిపరులకు డబ్బులుఇస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఎన్ఐఏ

- August 06, 2016 , by Maagulf
భారత్ లో  ఉగ్రవాద సానుభూతిపరులకు డబ్బులుఇస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఎన్ఐఏ

జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) భారీ విజయం సాధించింది. ఎన్ఐఏ ఇచ్చిన సమాచారం ఆధారంగా అబ్దుల్లా హడి అబ్దుల్ రెహమాన్ అల్ ఎనెజిని కువైట్‌లో అరెస్టు చేశారు. ఆయనకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది. అల్ ఎనెజీ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నాడని, ఐఎస్‌లోకి యువతను నియమిస్తున్నాడని అనుమానిస్తోంది. ఆయన మన దేశంలో అనేకమంది ఐఎస్ సానుభూతిపరులకు నిదులు అందజేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన అరీబ్ మజీద్‌కు కూడా ఎనెజీ నుంచి నిధులు లభించినట్లు సమాచారం. 2014 మేలో ఐఎస్‌లో చేరిన మజీద్ కొద్ది నెలల తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చేశాడు. ఎనెజీ తనకు 1,000 డాలర్లు పంపించాడని మజీద్ ఎన్ఐఏ దర్యాప్తులో అంగీకరించాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com