భారత్ లో ఉగ్రవాద సానుభూతిపరులకు డబ్బులుఇస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఎన్ఐఏ
- August 06, 2016
జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) భారీ విజయం సాధించింది. ఎన్ఐఏ ఇచ్చిన సమాచారం ఆధారంగా అబ్దుల్లా హడి అబ్దుల్ రెహమాన్ అల్ ఎనెజిని కువైట్లో అరెస్టు చేశారు. ఆయనకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ పేర్కొంది. అల్ ఎనెజీ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చుతున్నాడని, ఐఎస్లోకి యువతను నియమిస్తున్నాడని అనుమానిస్తోంది. ఆయన మన దేశంలో అనేకమంది ఐఎస్ సానుభూతిపరులకు నిదులు అందజేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన అరీబ్ మజీద్కు కూడా ఎనెజీ నుంచి నిధులు లభించినట్లు సమాచారం. 2014 మేలో ఐఎస్లో చేరిన మజీద్ కొద్ది నెలల తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చేశాడు. ఎనెజీ తనకు 1,000 డాలర్లు పంపించాడని మజీద్ ఎన్ఐఏ దర్యాప్తులో అంగీకరించాడు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







