ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- April 30, 2026
రియాద్: జాతీయ ఐక్యతకు, ప్రజా భద్రతకు హానికరంగా భావించే సోషల్ మీడియా కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు చేపట్టింది. ఇలాంటి కంటెంట్ ను వ్యాప్తి చేయడంలో పాలుపడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
జాతీయ ఐక్యత, సామాజిక శాంతికి భంగం కలిగించే అంశాలను ప్రస్తావిస్తూ.. గిరిజన విభజనను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో సహా సోషల్ మీడియా వేదికలపై పంచుకున్న కంటెంట్ను తాము పర్యవేక్షించినట్లు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఇందులో ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది.
సున్నితమైన అంశాలను వాడుకోవడానికి ప్రయత్నించడం, సమాజంలో విభజనను రెచ్చగొట్టడానికి చేసే ఏ ప్రయత్నాలపైనైనా తాము కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







