పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- April 30, 2026
న్యూ ఢిల్లీ: తెలంగాణలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఇంధన కొరత వార్తలపై సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తొలగించడానికి మరియు రబీ సీజన్ పనులకు ఆటంకం కలగకుండా ఉండటానికి పెట్రోల్, డీజిల్ సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరాను తక్షణమే 10 నుంచి 15 శాతం పెంచాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను (OMCs) కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా రబీ కోతల సమయం కావడంతో రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని, అగ్రికల్చర్ పనులకు ఇంధనం కొరత రాకుండా చూడాలని స్పష్టం చేశారు. పెట్రోల్ బంకుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ‘నో స్టాక్’ (No Stock) బోర్డులు పెట్టకూడదని, ఆదివారాలు మరియు ఇతర సెలవు దినాల్లో కూడా 24 గంటల పాటు నిరంతరాయంగా ఇంధన పంపిణీ జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మార్కెట్లోకి సాధారణం కంటే 190% అధికంగా డీజిల్ను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.
ఇంధన కొరత ఏర్పడటానికి ప్రధానంగా మూడు కారణాలను అధికారులు గుర్తించారు. ఒకటి, ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల ప్రజలు భయంతో ట్యాంకులు నింపుకుంటున్నారు. రెండోది, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలో ఇంధన లభ్యత తగ్గడంతో ఆయా సరిహద్దు జిల్లాల ప్రజలు తెలంగాణ బంకులపై ఆధారపడుతున్నారు. దీనికి తోడు, ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు (లీటరుకు రూ.150) పెరగడంతో కమర్షియల్ వాహనదారులు కూడా సాధారణ బంకుల్లోనే డీజిల్ కొనుగోలు చేస్తుండటం వల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.
తెలంగాణలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ భయాందోళన చెందవద్దని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రతి మూడు గంటలకోసారి బంకుల్లోని నిల్వలపై క్షేత్రస్థాయి అధికారుల నుండి నివేదికలు తీసుకుంటున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుమారు 3,100 ట్యాంకర్లతో రాష్ట్రవ్యాప్తంగా సరఫరాను క్రమబద్ధీకరించామని, ప్రజలు తమ అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసి భద్రతా పరమైన ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









