మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- May 01, 2026
కువైట్ః కువైట్ లో సివిల్ సర్వీస్ బ్యూరో జారీ చేసిన సర్క్యులర్కు అనుగుణంగా అధికారికంగా ఆమోదించబడిన వ్యవస్థ ప్రకారం మే 3(ఆదివారం) నుండి పనులను పునఃప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ) ప్రకటించింది. సౌత్ సుర్రాలోని తమ ప్రధాన శాఖలో ప్రతిరోజూ రెండు షిఫ్టులలో కార్డుల సేకరణ జరుగుతుందని అథారిటీ పేర్కొంది. ఉదయం షిఫ్ట్ పౌరుల కోసం కేటాయించబడగా, సాయంత్రం షిఫ్ట్ కువైట్ యేతర పౌరుల కోసం కేటాయించబడుతుందని తెలిపింది. అహ్మది (సౌత్ సబహియా) మరియు జహ్రాలోని తమ శాఖలు ఉదయం సమయంలో సందర్శకులను స్వీకరిస్తాయని, అయితే కార్డుల పంపిణీ సేవలు ప్రతిరోజూ రెండు షిఫ్టులలో కొనసాగుతాయని పీఏసీఐ మరింత స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









