బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- May 02, 2026
మనామా: తమ్కీన్ సహాయ పథకాల పరిధిలోకి రాని బహ్రెయిన్ కార్మికులను, ప్రస్తుత పరిస్థితుల వల్ల దెబ్బతిన్న కంపెనీల మద్దతు పరిధిలోకి తీసుకురావాలని ఎంపీ మహమ్మద్ మూసా మరియు మరో నలుగురు ఎంపీలు ఒక అత్యవసర ప్రతిపాదనను చేశారు.ఈ ప్రణాళిక, తమ్కీన్ సహాయం ఎన్నడూ అందుకోని బహ్రెయిన్ సిబ్బందితో పాటు గతంలో లబ్ధి పొంది, ప్రస్తుత పథకాల పరిధిలోకి రాని వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఒత్తిడిలో ఉన్న సంస్థలు బహ్రెయిన్ కార్మికులను తమ జీతాల జాబితాలో ఉంచుకోవడానికి సహాయపడటం, అదే సమయంలో వాళ్ల కుటుంబాలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని లేదా మొత్తం ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడం దీని లక్ష్యమని తెలిపారు. కొన్ని వ్యాపారాలు పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున, అది వారి స్థానిక సిబ్బందిని నిలుపుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని, అందుకే ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టినట్లు ఎంపీలు తెలిపారు.
‘మద్దతు కార్యక్రమాల నుండి లబ్ధి పొందని, లేదా గతంలో లబ్ధి పొంది ప్రస్తుత మద్దతు పథకాలలో చేర్చబడని బహ్రెయిన్ ఉద్యోగులపై’ దీని ప్రభావం అత్యంత తీవ్రంగా పడిందని ఆయన అన్నారు. ఈ అంతరం, ఇప్పటికే అధిక జీవన వ్యయాలు భరిస్తున్న కార్మికులలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలను పెంచిందని ఎంపీ అన్నారు. ఇలాంటి పరిస్థులు కారణంగా బహ్రెయిన్ కుటుంబాలపై భారం మోపిందని, అర్హులైన కార్మికులందరినీ తమ్కీన్ సహాయం కిందకు తీసుకురావడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీలు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







