బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- May 02, 2026
మనామా: తమ్కీన్ సహాయ పథకాల పరిధిలోకి రాని బహ్రెయిన్ కార్మికులను, ప్రస్తుత పరిస్థితుల వల్ల దెబ్బతిన్న కంపెనీల మద్దతు పరిధిలోకి తీసుకురావాలని ఎంపీ మహమ్మద్ మూసా మరియు మరో నలుగురు ఎంపీలు ఒక అత్యవసర ప్రతిపాదనను చేశారు.ఈ ప్రణాళిక, తమ్కీన్ సహాయం ఎన్నడూ అందుకోని బహ్రెయిన్ సిబ్బందితో పాటు గతంలో లబ్ధి పొంది, ప్రస్తుత పథకాల పరిధిలోకి రాని వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఒత్తిడిలో ఉన్న సంస్థలు బహ్రెయిన్ కార్మికులను తమ జీతాల జాబితాలో ఉంచుకోవడానికి సహాయపడటం, అదే సమయంలో వాళ్ల కుటుంబాలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని లేదా మొత్తం ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదాన్ని తగ్గించడం దీని లక్ష్యమని తెలిపారు. కొన్ని వ్యాపారాలు పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొంటున్నందున, అది వారి స్థానిక సిబ్బందిని నిలుపుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని, అందుకే ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టినట్లు ఎంపీలు తెలిపారు.
‘మద్దతు కార్యక్రమాల నుండి లబ్ధి పొందని, లేదా గతంలో లబ్ధి పొంది ప్రస్తుత మద్దతు పథకాలలో చేర్చబడని బహ్రెయిన్ ఉద్యోగులపై’ దీని ప్రభావం అత్యంత తీవ్రంగా పడిందని ఆయన అన్నారు. ఈ అంతరం, ఇప్పటికే అధిక జీవన వ్యయాలు భరిస్తున్న కార్మికులలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలను పెంచిందని ఎంపీ అన్నారు. ఇలాంటి పరిస్థులు కారణంగా బహ్రెయిన్ కుటుంబాలపై భారం మోపిందని, అర్హులైన కార్మికులందరినీ తమ్కీన్ సహాయం కిందకు తీసుకురావడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీలు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







