బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- May 02, 2026
కువైట్ సిటీ: బస్సు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను జ్లీబ్ అల్-షయూఖ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తించారు.
ప్రజా రవాణా సంస్థకు చెందిన టికెట్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సుల్లో ప్రయాణికుల వద్ద వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి.
పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా వారి నేరాలను నిర్ధారించారు.
నిందితుల వద్ద నుంచి దొంగిలించినట్లు భావిస్తున్న 333 కువైట్ దీనార్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తదుపరి న్యాయపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజా రవాణా సేవలను ఉపయోగించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







