బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- May 02, 2026
కువైట్ సిటీ: బస్సు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను జ్లీబ్ అల్-షయూఖ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన నిందితులు బంగ్లాదేశ్కు చెందిన వారిగా గుర్తించారు.
ప్రజా రవాణా సంస్థకు చెందిన టికెట్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బస్సుల్లో ప్రయాణికుల వద్ద వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాయి.
పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా వారి నేరాలను నిర్ధారించారు.
నిందితుల వద్ద నుంచి దొంగిలించినట్లు భావిస్తున్న 333 కువైట్ దీనార్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని తదుపరి న్యాయపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజా రవాణా సేవలను ఉపయోగించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







