ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- May 02, 2026
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిలో మరో మైలురాయిని చేరుకోబోతోంది. ముఖ్యంగా రక్షణ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు శ్రీ సత్యసాయి జిల్లాను ‘డిఫెన్స్ హబ్’గా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగా పుట్టపర్తి ప్రాంతంలో డీఆర్డీవో (DRDO) ఆధ్వర్యంలో ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమాన ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
రూ.15,000 కోట్లతో మెగా ప్రాజెక్టు భారత రక్షణ శాఖకు చెందిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), డీఆర్డీవో సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టనున్నాయి. సుమారు 15,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఐదవ తరం యుద్ధ విమానాల అభివృద్ధి, తయారీ ప్రక్రియ కొనసాగనుంది.
DRDO Project Puttaparthi: 15న శంకుస్థాపన
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15వ తేదీన ఈ మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టు రాకతో రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, అనుబంధ పరిశ్రమలు కూడా ఈ ప్రాంతానికి తరలివచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







