న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- May 03, 2026
మనామాః బహ్రెయిన్ న్యాయవ్యవస్థ చట్టంపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ముగ్గురు ఎంపీలను వారి పదవుల నుండి తొలగించాలని పది మంది ఎంపీలు పార్లమెంటును కోరారు. వారు తమ ప్రమాణాన్ని ఉల్లంఘించారని, సభలో కొనసాగడానికి అవసరమైన విశ్వాసాన్ని కోల్పోయారని ఆరోపించారు. స్పీకర్కు పంపిన ఈ అభ్యర్థనలో అబ్దుల్నబీ సల్మాన్ నాసర్, మమ్దూ అబ్బాస్ అల్ సలేహ్ మరియు మెహదీ అబ్దుల్ అజీజ్ అల్ షువైఖ్లను సభ్యత్వం నుండి తొలగించాలని పేర్కొన్నారు.
సదరు ఎంపీలు బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను కొనియాడుతూ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేశారు. వారు తమ వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించారని పేర్కొన్నారు. ఇది జాతీయ ఐక్యతను మరియు ఎన్నికైన అధికారుల విధులను ఉల్లంఘించడమేనని తమ అభ్యర్థనలో ఎంపీలు తెలిపారు. ఈ మేరకు మహ్మద్ సల్మాన్ అల్ అహ్మద్, హమద్ ఫరూక్ అల్ దోయ్, జమీల్ ముల్లా హసన్, బాదర్ అల్ తమీమి, మహ్మద్ అల్ బలూషి, అలీ సకర్ అల్ దోసారి, అబ్దుల్లా అల్ రుమైహి, మహ్మద్ అల్ ఒలైవి, అబ్దుల్లా అల్ ధాన్ మరియు మహ్మద్ అల్ రిఫాయ్ స్పీకర్ కు అభ్యర్థనను సమర్పించారు.
తాజా వార్తలు
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!
- కిడ్స్ గో ఫ్రీ ప్రచారాన్ని ప్రారంభించిన విజిట్ ఖతార్..!!









