న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- May 03, 2026
మనామాః బహ్రెయిన్ న్యాయవ్యవస్థ చట్టంపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ముగ్గురు ఎంపీలను వారి పదవుల నుండి తొలగించాలని పది మంది ఎంపీలు పార్లమెంటును కోరారు. వారు తమ ప్రమాణాన్ని ఉల్లంఘించారని, సభలో కొనసాగడానికి అవసరమైన విశ్వాసాన్ని కోల్పోయారని ఆరోపించారు. స్పీకర్కు పంపిన ఈ అభ్యర్థనలో అబ్దుల్నబీ సల్మాన్ నాసర్, మమ్దూ అబ్బాస్ అల్ సలేహ్ మరియు మెహదీ అబ్దుల్ అజీజ్ అల్ షువైఖ్లను సభ్యత్వం నుండి తొలగించాలని పేర్కొన్నారు.
సదరు ఎంపీలు బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను కొనియాడుతూ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేశారు. వారు తమ వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించారని పేర్కొన్నారు. ఇది జాతీయ ఐక్యతను మరియు ఎన్నికైన అధికారుల విధులను ఉల్లంఘించడమేనని తమ అభ్యర్థనలో ఎంపీలు తెలిపారు. ఈ మేరకు మహ్మద్ సల్మాన్ అల్ అహ్మద్, హమద్ ఫరూక్ అల్ దోయ్, జమీల్ ముల్లా హసన్, బాదర్ అల్ తమీమి, మహ్మద్ అల్ బలూషి, అలీ సకర్ అల్ దోసారి, అబ్దుల్లా అల్ రుమైహి, మహ్మద్ అల్ ఒలైవి, అబ్దుల్లా అల్ ధాన్ మరియు మహ్మద్ అల్ రిఫాయ్ స్పీకర్ కు అభ్యర్థనను సమర్పించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







