న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- May 03, 2026
మనామాః బహ్రెయిన్ న్యాయవ్యవస్థ చట్టంపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యులు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ముగ్గురు ఎంపీలను వారి పదవుల నుండి తొలగించాలని పది మంది ఎంపీలు పార్లమెంటును కోరారు. వారు తమ ప్రమాణాన్ని ఉల్లంఘించారని, సభలో కొనసాగడానికి అవసరమైన విశ్వాసాన్ని కోల్పోయారని ఆరోపించారు. స్పీకర్కు పంపిన ఈ అభ్యర్థనలో అబ్దుల్నబీ సల్మాన్ నాసర్, మమ్దూ అబ్బాస్ అల్ సలేహ్ మరియు మెహదీ అబ్దుల్ అజీజ్ అల్ షువైఖ్లను సభ్యత్వం నుండి తొలగించాలని పేర్కొన్నారు.
సదరు ఎంపీలు బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను కొనియాడుతూ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేశారు. వారు తమ వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వ చర్యలను ప్రశ్నించారని పేర్కొన్నారు. ఇది జాతీయ ఐక్యతను మరియు ఎన్నికైన అధికారుల విధులను ఉల్లంఘించడమేనని తమ అభ్యర్థనలో ఎంపీలు తెలిపారు. ఈ మేరకు మహ్మద్ సల్మాన్ అల్ అహ్మద్, హమద్ ఫరూక్ అల్ దోయ్, జమీల్ ముల్లా హసన్, బాదర్ అల్ తమీమి, మహ్మద్ అల్ బలూషి, అలీ సకర్ అల్ దోసారి, అబ్దుల్లా అల్ రుమైహి, మహ్మద్ అల్ ఒలైవి, అబ్దుల్లా అల్ ధాన్ మరియు మహ్మద్ అల్ రిఫాయ్ స్పీకర్ కు అభ్యర్థనను సమర్పించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







