స్నేహితుల దినోత్సవం రోజున మోదీ పర్యటన ఆనందదాయకo
- August 07, 2016
ప్రధాని హోదాలో తొలిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్న నరేంద్రమోదీకి తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్వాగతం పలికారు. స్నేహితుల దినోత్సవం రోజున మోదీ పర్యటన ఆనందదాయకమని ట్వీట్ చేశారు. ప్రధాని పర్యటనతో కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత స్నేహపూర్వక తోడ్పాటు ఉందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ మెదక్జిల్లా గజ్వేల్ మండలం కోమటి బండలో మిషన్భగీరథ మొదటి దశను ప్రారంభించనున్నారు. అనంతరంరామగుండంలో 166 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్కేంద్రం, ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్లకు శంకుస్థాపన శిలాపలకాలను ఆవిష్కరిస్తారు. ప్రధాని హోదాలో నరేంద్రమోదీ తొలిసారిగా తెలంగాణకు రానుండటంతో ప్రత్యేకత ఏర్పడింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







