మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- May 06, 2026
దోహా: ఓల్డ్ దోహా పోర్ట్ చేపల పోటీ మూడవ ఎడిషన్ మే 13 నుండి 16 వరకు జరుగనుంది. ఖతార్ జలాల్లో నాలుగు రోజుల పాటు జరిగే పోటీ చేపల వేట కోసం ఖతార్ నలుమూలల నుండి జట్లు పాల్గొంటాయి. అన్ని రకాల నౌకలకు సముద్రయానాన్ని పూర్తిగా పునఃప్రారంభించినట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ పోటీలపై ఆసక్తి నెలకొన్నది.
ఈ సీజన్లో 132 జట్ల నుండి 578 మంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది పోటీలో ఇప్పటివరకు జరిగినవాటిలోకెల్లా అత్యంత విలువైన బహుమతులను అందజేయనున్నారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు GWM ట్యాంక్ 500, రెండవ స్థానానికి GWM ట్యాంక్ 300, మరియు మూడవ స్థానానికి హవాల్ H9 వాహనం ఉంటాయి. నాలుగో స్థానంలో నిలిచిన విజేతకు హలౌల్ బోట్ ఫ్యాక్టరీ అందించిన పడవ లభిస్తుంది. ఐదవ స్థానం నుండి పదవ స్థానం వరకు నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేస్తారు.
పోటీలో భాగంగా ఆయా జట్లు అతిపెద్ద కింగ్ఫిష్ (కనాడ్) కోసం పోటీ పడటానికి ఓల్డ్ దోహా పోర్ట్ నుండి బయలుదేరుతాయి. పట్టుకున్న చేపల బరువు ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీ, మే 16(శనివారం) సాయంత్రం ఓల్డ్ దోహా పోర్ట్లో జరిగే న్యాయనిర్ణయం మరియు బహుమతుల ప్రదానోత్సవంతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







