మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- May 06, 2026
దోహా: ఓల్డ్ దోహా పోర్ట్ చేపల పోటీ మూడవ ఎడిషన్ మే 13 నుండి 16 వరకు జరుగనుంది. ఖతార్ జలాల్లో నాలుగు రోజుల పాటు జరిగే పోటీ చేపల వేట కోసం ఖతార్ నలుమూలల నుండి జట్లు పాల్గొంటాయి. అన్ని రకాల నౌకలకు సముద్రయానాన్ని పూర్తిగా పునఃప్రారంభించినట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ పోటీలపై ఆసక్తి నెలకొన్నది.
ఈ సీజన్లో 132 జట్ల నుండి 578 మంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది పోటీలో ఇప్పటివరకు జరిగినవాటిలోకెల్లా అత్యంత విలువైన బహుమతులను అందజేయనున్నారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు GWM ట్యాంక్ 500, రెండవ స్థానానికి GWM ట్యాంక్ 300, మరియు మూడవ స్థానానికి హవాల్ H9 వాహనం ఉంటాయి. నాలుగో స్థానంలో నిలిచిన విజేతకు హలౌల్ బోట్ ఫ్యాక్టరీ అందించిన పడవ లభిస్తుంది. ఐదవ స్థానం నుండి పదవ స్థానం వరకు నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేస్తారు.
పోటీలో భాగంగా ఆయా జట్లు అతిపెద్ద కింగ్ఫిష్ (కనాడ్) కోసం పోటీ పడటానికి ఓల్డ్ దోహా పోర్ట్ నుండి బయలుదేరుతాయి. పట్టుకున్న చేపల బరువు ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీ, మే 16(శనివారం) సాయంత్రం ఓల్డ్ దోహా పోర్ట్లో జరిగే న్యాయనిర్ణయం మరియు బహుమతుల ప్రదానోత్సవంతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







