మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- May 06, 2026
దోహా: ఓల్డ్ దోహా పోర్ట్ చేపల పోటీ మూడవ ఎడిషన్ మే 13 నుండి 16 వరకు జరుగనుంది. ఖతార్ జలాల్లో నాలుగు రోజుల పాటు జరిగే పోటీ చేపల వేట కోసం ఖతార్ నలుమూలల నుండి జట్లు పాల్గొంటాయి. అన్ని రకాల నౌకలకు సముద్రయానాన్ని పూర్తిగా పునఃప్రారంభించినట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన నేపథ్యంలో ఈ పోటీలపై ఆసక్తి నెలకొన్నది.
ఈ సీజన్లో 132 జట్ల నుండి 578 మంది పాల్గొంటున్నారు. ఈ ఏడాది పోటీలో ఇప్పటివరకు జరిగినవాటిలోకెల్లా అత్యంత విలువైన బహుమతులను అందజేయనున్నారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు GWM ట్యాంక్ 500, రెండవ స్థానానికి GWM ట్యాంక్ 300, మరియు మూడవ స్థానానికి హవాల్ H9 వాహనం ఉంటాయి. నాలుగో స్థానంలో నిలిచిన విజేతకు హలౌల్ బోట్ ఫ్యాక్టరీ అందించిన పడవ లభిస్తుంది. ఐదవ స్థానం నుండి పదవ స్థానం వరకు నిలిచిన జట్లకు నగదు బహుమతులు అందజేస్తారు.
పోటీలో భాగంగా ఆయా జట్లు అతిపెద్ద కింగ్ఫిష్ (కనాడ్) కోసం పోటీ పడటానికి ఓల్డ్ దోహా పోర్ట్ నుండి బయలుదేరుతాయి. పట్టుకున్న చేపల బరువు ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీ, మే 16(శనివారం) సాయంత్రం ఓల్డ్ దోహా పోర్ట్లో జరిగే న్యాయనిర్ణయం మరియు బహుమతుల ప్రదానోత్సవంతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- యూఏఈలో Dh1.046 బిలియన్లతో కొత్త డీశాలినేషన్ స్టేషన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై బ్రిటిష్, కువైట్ తో ఒమన్ చర్చలు..!!
- మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్









