అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- May 07, 2026
అబుదాబి: ఖతార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్ఈ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ.. యూఏఈ ఉప ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి హెచ్హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అబుదాబిలో జరిగిన ఖతార్-యూఏఈ సంయుక్త సుప్రీం కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య వివిధ రంగాలలో సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ సమావేశం గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉందని తెలిపారు. ఈ సమావేశాన్ని నిర్వహించడంలో మరియు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంలో కృషి చేసిన సన్నాహక కమిటీని వారు ప్రశంసించారు.
రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, విజయాలను సమీక్షించడం మరియు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లక్ష్యంగా గతంలో జరిగిన సమావేశాల కొనసాగింపుగా నేటి సమావేశం జరుగుతోందని పేర్కొన్నారు.
గల్ఫ్ ప్రాంతంలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు మరియు అసాధారణ సంఘటనలపై వారు సమీక్షించారు. హోర్ముజ్ జలసంధి సంక్షోభం, అలాగే ప్రాంతీయ దేశాలపై ఇరాన్ దూకుడుగా సాగిస్తున్న సైనిక దాడుల వల్ల ఎదురవుతున్న సవాళ్లపై చర్చించారు. ఈ దాడులు ప్రాంతీయ స్థిరత్వంతోపాటు నౌకాయాన స్వేచ్ఛను ప్రభావితం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
పరస్పర ప్రయోజనాలను బలోపేతం చేయడానికి.. ముఖ్యంగా చమురు, గ్యాస్ మరియు ఇంధనం వంటి కీలక రంగాలలో వ్యూహాత్మక అనుసంధానాన్ని మరియు ఆర్థిక సమైక్యతను పెంపొందించాలనే ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. ఈ సమావేశ ఫలితాలు భాగస్వామ్యాన్ని మరియు ఉమ్మడి లక్ష్యాలను మరింత పటిష్టం చేసే స్పష్టమైన ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పలు రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







