ఏపీ చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి.భరత్ భూషణ్..
- May 10, 2026
అమరావతి: తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి.భరత్ భూషణ్ ను నియమించింది ఏపీ ప్రభుత్వం.
సినిమాల పై మక్కువతో 20 ఏళ్లుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వచ్చారు భరత్ భూషణ్. భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి, ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న స్థాయి సమస్యల నుండి కార్మికుల సమస్యల వరకు ప్రతి సమస్యను తీర్చే ప్రయత్నం చేసారు.
ఇటీవలే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పి భరత్ భూషణ్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరత్ భూషణ్ ని రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో గొర్రెల కాపరిగా కష్టాలు పడుతున్న యువకుడు
- ఏపీ చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పి.భరత్ భూషణ్..
- ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేసిన సీఎం విజయ్
- డెన్వర్ ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం
- 29 ఏళ్లకే మంత్రిగా ఎస్.కీర్తన సరికొత్త రికార్డు
- తమిళనాడులో కొత్త శకం మొదలైంది–విజయ్ కీలక వ్యాఖ్యలు
- 500 మంది రొమ్ము క్యాన్సర్ బాధితులకు పీహెచ్సీసీ కేటాయింపు..!!
- అల్-మసీలా వైపు వెళ్లే రింగ్ రోడ్పై తాత్కాలిక ఆంక్షలు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రాలో 3,700 మందికి పైగా విజేతలు..!!
- నివాస, కార్మిక, భద్రతా చట్టాల ఉల్లంఘన.. 11,175 మంది అరెస్టు..!!









