ప్రధాని మోదీ వెళ్లే దారిలో పేలుడు పదార్థాల గుర్తింపు!
- May 10, 2026
బెంగళూరులోని కగ్గళిపుర ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ ప్రయాణించే మార్గానికి అతి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిలిటెన్ స్టిక్స్ బయటపడటంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పేలుడు పదార్థాల ఉనికిని గుర్తించిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటనను టార్గెట్ చేస్తూ ఏవైనా కుట్రలు పన్నారా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ప్రధాని భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) తనిఖీలు ముమ్మరం చేసింది. కగ్గళిపుర పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. అనుమానిత వాహనాలను, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచారు.
తాజా వార్తలు
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..
- ఉప్పాడ మత్స్యకారులకు గుడ్ న్యూస్..
- ఉచితంగా NEET కోచింగ్-తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం..
- రోడ్ల నిర్వహణలో దుబాయ్ ఆర్టీఏకు మరో ప్రపంచస్థాయి గుర్తింపు
- ఏపీ బీచ్శాండ్ మినరల్స్కు విలువ జోడించాలి: సీఎం చంద్రబాబు
- ఒమన్ తీరాలకు విస్తరించిన చమురు కాలుష్యం..
- దుబాయిలో భారత కాన్సుల్ జనరల్ను కలిసిన GWAC కార్యవర్గం
- అబుదాబి కస్టమ్స్ పేరుతో నకిలీ సందేశాలు.. ప్రజలకు కీలక హెచ్చరిక







