ప్రధాని మోదీ వెళ్లే దారిలో పేలుడు పదార్థాల గుర్తింపు!
- May 10, 2026
బెంగళూరులోని కగ్గళిపుర ప్రాంతంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోదీ ప్రయాణించే మార్గానికి అతి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిలిటెన్ స్టిక్స్ బయటపడటంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
పేలుడు పదార్థాల ఉనికిని గుర్తించిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉందని అనుమానిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటనను టార్గెట్ చేస్తూ ఏవైనా కుట్రలు పన్నారా అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
ప్రధాని భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) తనిఖీలు ముమ్మరం చేసింది. కగ్గళిపుర పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. అనుమానిత వాహనాలను, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచారు.
తాజా వార్తలు
- రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ
- రిజర్వేషన్లు ఉన్నా..బోర్డింగ్ నిరాకరణ.. 114 ఫిర్యాదులు..!!
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- లైసెన్సు లేకుండా బైక్ నడిపిన టీనేజర్ అరెస్టు..!!
- కొత్తగా వచ్చే కార్మికుల కోసం వైద్య పరీక్షలు..!!
- మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యవస్థలు..!!
- మక్కాలో 18 మంది పాకిస్థానీలు, ఆఫ్ఘన్లు అరెస్టు..!!
- నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్.. ఇద్దరు మహిళలకు 7 లక్షల దిర్హమ్ల జరిమానా..!!
- దోహా తీరంలో నౌకపై క్షిపణి దాడి
- సీఎంగా రెండోసారి హిమంత్ బిశ్వశర్మ









