ప్రాన్స్ డిమ్సమ్
- July 24, 2015
ప్రాన్స్ డిమ్సమ్
కావలిసిన పదార్ధాలు
రొయ్యలు - ఎనిమిది
మైదా - అరకప్పు
ఉల్లికాడల తరుగు - రెండు స్పూన్లు
అల్లం తరుగు - ఒక స్పూను
సోయా సాస్ - అరస్పూను
మిరియాల పొడి - అరస్పూను
నువ్వుల నూనె - అరస్పూను
నువ్వులు - ఒక స్పూను
వెల్లుల్లిరెబ్బలు - ఐదు
టొమాటో - ఒకటి
నూనె - సరిపడా
ఉప్పు - సరిపడా
తయారీ విధానం
మైదాపిండిలో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. రొయ్యలను శుభ్రం చేసి వాటిపై ఉప్పు,కారం,అల్లం తరుగూ, ఉల్లికాడల తరుగూ,సోయాసాస్, నువ్వుల నూనె, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకుని వాటి మధ్య ఒక రొయ్యను మసాలా మిశ్రమంతో పాటు ఉంచి, పూరీ అంచుల్ని మూసేసి డిమ్ సన్ ఆకృతిలో వచ్చేట్లు చేసి కొంచెం సేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి, వెల్లుల్లి రెబ్బలూ,నువ్వులూ, మిరియాలపొడీ, ఎండుమిర్చీ, టొమాటో ముక్కలూ ఉప్పు వేసి వేయించి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసి డిమ్సమ్ల(ఆవిరిలో ఉడికించిన రొయ్యలు)ను ఈ వెల్లుల్లి మిశ్రమంతో కలిపి వడ్డిస్తే సరి. డిఫరెంట్గా రొయ్య స్నాక్స్ రెడీ.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







