ప్రాన్స్ డిమ్సమ్
- July 24, 2015
ప్రాన్స్ డిమ్సమ్
కావలిసిన పదార్ధాలు
రొయ్యలు - ఎనిమిది
మైదా - అరకప్పు
ఉల్లికాడల తరుగు - రెండు స్పూన్లు
అల్లం తరుగు - ఒక స్పూను
సోయా సాస్ - అరస్పూను
మిరియాల పొడి - అరస్పూను
నువ్వుల నూనె - అరస్పూను
నువ్వులు - ఒక స్పూను
వెల్లుల్లిరెబ్బలు - ఐదు
టొమాటో - ఒకటి
నూనె - సరిపడా
ఉప్పు - సరిపడా
తయారీ విధానం
మైదాపిండిలో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. రొయ్యలను శుభ్రం చేసి వాటిపై ఉప్పు,కారం,అల్లం తరుగూ, ఉల్లికాడల తరుగూ,సోయాసాస్, నువ్వుల నూనె, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పిండిని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకుని వాటి మధ్య ఒక రొయ్యను మసాలా మిశ్రమంతో పాటు ఉంచి, పూరీ అంచుల్ని మూసేసి డిమ్ సన్ ఆకృతిలో వచ్చేట్లు చేసి కొంచెం సేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి, వెల్లుల్లి రెబ్బలూ,నువ్వులూ, మిరియాలపొడీ, ఎండుమిర్చీ, టొమాటో ముక్కలూ ఉప్పు వేసి వేయించి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసి డిమ్సమ్ల(ఆవిరిలో ఉడికించిన రొయ్యలు)ను ఈ వెల్లుల్లి మిశ్రమంతో కలిపి వడ్డిస్తే సరి. డిఫరెంట్గా రొయ్య స్నాక్స్ రెడీ.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







