రెండు కొత్త రైళ్లను ప్రారంభించిన సురేశ్‌ ప్రభు..

- August 07, 2016 , by Maagulf
రెండు కొత్త రైళ్లను  ప్రారంభించిన సురేశ్‌ ప్రభు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు సోమవారం రెండు కొత్త రైళ్లను ప్రారంభించారు. గుల్బర్గా- హైదరాబాద్ ఇంటర్ సిటీ డైలీ ఎక్స్ ప్రెస్ తోపాటు కాజీపేట్ - ముంబాయి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లును ఆయన వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.అలాగే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంపై నిర్మించిన ఏసీ రిటైరింగ్ రూం, డార్మిటరీతోపాటు హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో వందశాతం ఎల్‌ఈడీ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు, మహేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తోపాటు రైల్వే జీఎం రవీందర్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com