యూఏఈ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం పై యూఏఈ అధ్యక్షుడు, ప్రధాని మోదీ
- May 15, 2026
అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య అబుదాబిలో కీలక సమావేశం జరిగింది. భారత్–యూఏఈ మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (Comprehensive Strategic Partnership) మరియు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) పరిధిలో సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు.
యూఏఈ అధికారిక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశంలో, రెండు దేశాల అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పాన్ని ఇరు నేతలు పునరుద్ఘాటించారు. ప్రజల శాశ్వత అభివృద్ధి, ఆర్థిక సుసంపన్నత కోసం పరస్పర సహకారాన్ని విస్తరించాలని నిర్ణయించారు.
ఆర్థికం, పెట్టుబడులు, ఇంధనం, అంతరిక్షం, ఆహార భద్రత, సాంకేతికత మరియు కృత్రిమ మేధస్సు (AI) రంగాల్లో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సహకార పురోగతిని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ మరియు ప్రధాని మోదీ సమీక్షించారు.
మధ్యప్రాచ్య ప్రాంత తాజా పరిణామాలు, వాటి వల్ల ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతి భద్రతలపై ఏర్పడుతున్న ప్రభావాలపై కూడా ఇరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు. సముద్ర భద్రత, ఇంధన సరఫరాలు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రస్తుత పరిస్థితుల ప్రభావాన్ని చర్చించారు.
ఈ సందర్భంగా యూఏఈలో పౌరులు, పౌర సౌకర్యాలు మరియు మౌలిక వసతులపై జరిగిన ఇరానియన్ ఉగ్రదాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇటువంటి దాడులు సార్వభౌమత్వానికి, అంతర్జాతీయ నిబంధనలు మరియు చట్టాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
ఈ సమావేశానికి అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు ఉప ప్రధాని షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, ప్రత్యేక వ్యవహారాల అధ్యక్ష కోర్టు ఉపాధ్యక్షుడు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అధ్యక్ష సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్తో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ వెంట భారత ప్రతినిధి బృందానికి చెందిన పలువురు కేంద్ర మంత్రులు మరియు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







