‘బ్లాక్ మెయిల్’ చేస్తానంటున్న వరుణ్ సందేశ్..
- May 17, 2026
వరుణ్ సందేశ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించాడు. వరుణ్ సందేశ్ హీరోగా హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాణంలో శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో బ్లాక్ మెయిల్ అనే కొత్త సినిమాని నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఈ సినిమాలో జెమిని సురేష్, పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్.. పలువురు కీలకపాత్రలు పోషించనున్నారు. ఓపెనింగ్ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట క్లాప్ కొట్టగా నిర్మాత భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా జెమిని సురేష్ గారి తల్లి ఎం వెంకట సుబ్బలక్ష్మి మొదటి షాట్ దర్శకత్వం వహించారు.
సినిమా లాంచ్ అనంతరం వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నాకు డైరెక్టర్ చాలా కాలంగా తెలుసు. ఈ కథ చెప్పినప్పుడు మంచి కంటెంట్ తో సినిమా వస్తుంది అని అర్థం అయింది అని అన్నారు. డైరెక్టర్ శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ.. మంచి ప్రాజెక్ట్ ను నమ్మి నా చేతిలో పెట్టిన నిర్మాతలకు కృతజ్ఞతలు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది అని అన్నారు.
నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ.. బ్లాక్ మెయిల్ సినిమాలో వరుణ్ సందేశ్ గారితో కలిసి నటించబోతున్నాను. నేను హీరోగా తొలి చిత్రం దర్శకత్వం చేసిన శ్రీనివాస్ ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండబోతుంది అని అన్నారు. నిర్మాత అవినాష్ మాట్లాడుతూ.. నేను ఈ సినిమా రంగంలోకి రావడానికి ముఖ్య కారణం 200 కుటుంబాలకు పని కలిగించవచ్చు అని. నా సినిమాకు వచ్చే లాభాలలో 10% మా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ కి ఇస్తాను అని తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







