15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- August 24, 2026
హైదరాబాద్: బిట్స్ పిలానీ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (WILP) నిర్వహించిన కాన్వొకేషన్ 2026లో రికార్డు స్థాయిలో 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 30 ప్రత్యేక విభాగాల్లో విద్యను పూర్తి చేసిన వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ కార్యక్రమంలో పట్టాలు అందుకున్నారు.
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్లో నిర్వహించిన ఈ కాన్వొకేషన్లో గత ఏడాదితో పోలిస్తే గ్రాడ్యుయేట్ల సంఖ్య దాదాపు రెట్టింపైంది.ఈ కార్యక్రమాన్ని ‘ఫిజిటల్’ (Phygital) విధానంలో నిర్వహించారు. భౌతికంగా కార్యక్రమం జరగడంతో పాటు ప్రత్యేకంగా రూపొందించిన మెటావర్స్ వేదికను కూడా వినియోగించారు.
ఈ కార్యక్రమానికి డిక్సన్ టెక్నాలజీస్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ బి. లాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రామగోపాల్ రావు, ఆఫ్-క్యాంపస్ ప్రోగ్రామ్స్ అండ్ ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ ఇన్చార్జ్ ప్రొఫెసర్ ఎస్. గురునారాయణన్ పాల్గొన్నారు.
నిరంతర అభ్యాసం కీలకం: కుమార్ మంగళం బిర్లా
బిట్స్ పిలానీ ఛాన్సలర్ డా. కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ, భారత్ ప్రస్తుతం కీలకమైన ఆర్థిక దశలో ఉందని అన్నారు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవడం దేశ ఉత్పాదకతను పెంచడంతో పాటు సాంకేతిక రంగంలో భారత స్వావలంబనను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా ప్రొఫెషనల్స్ తమ కెరీర్లో ముందుకు సాగడంతో పాటు దేశ ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి కూడా తోడ్పడగలరని ఆయన అన్నారు.
టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాలకు అధిక ప్రాతినిధ్యం
ఈ ఏడాది గ్రాడ్యుయేట్లలో వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు ఉండటం ప్రత్యేకతగా నిలిచింది. టెక్నాలజీ, డిజిటల్ రంగాలకు చెందిన వారు 46 శాతం ఉండగా, ఇంజినీరింగ్, తయారీ, మౌలిక వసతుల రంగాలకు చెందిన వారు 35 శాతం ఉన్నారు.
గ్రాడ్యుయేట్లలో 2,000 మందికి పైగా మహిళా ప్రొఫెషనల్స్, 167 మంది వైద్యులు, 60 మంది రక్షణ సిబ్బంది ఉన్నారు. 15 దేశాలకు చెందిన 80 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు కూడా ఈ బ్యాచ్లో ఉన్నారు.
51 వేల మందికి పైగా విద్యార్థులు
వర్కింగ్ ప్రొఫెషనల్స్కు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యను అందించడంలో బిట్స్ పిలానీ WILPకు దాదాపు ఐదు దశాబ్దాల అనుభవం ఉంది.
ప్రస్తుతం WILPలో 51,000 మందికి పైగా విద్యార్థులు వివిధ ప్రోగ్రామ్లలో విద్యను అభ్యసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 32 దేశాల్లో 1.5 లక్షలకు పైగా ప్రొఫెషనల్స్తో బిట్స్ పిలానీ WILPకు విస్తృతమైన అలుమ్ని నెట్వర్క్ ఉంది.
వృత్తిపరమైన బాధ్యతలను కొనసాగిస్తూనే ఉన్నత విద్య, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకునే ఉద్యోగుల్లో ఫ్లెక్సిబుల్, ఇండస్ట్రీ-లింక్డ్ ఎడ్యుకేషన్కు పెరుగుతున్న డిమాండ్ను 2026 కాన్వొకేషన్ ప్రతిబింబిస్తోందని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







