యూఏఈ దాడి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
- May 18, 2026
యూఏఈలోని ఏకైక అణువిద్యుత్ కేంద్రం ‘బారాక్’ లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిపై భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ దాడి జరగడం ప్రమాదకరమైన పరిణామమని అభివర్ణిస్తూ సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. యుఎఇలోని అణుకేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ఇటువంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని, ఇవి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తాయని భారత్ పేర్కొంది. సంబంధిత పక్షాలన్నీ సంయమనం పాటించాలని, తక్షణమే దౌత్యం, చర్చల మార్గానికి తిరిగి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. కాగా, గల్ఫ్ దేశంలోని ఏకైక అణు విద్యుత్ కేంద్రమైన బారాక్ సమీపంలో ఒక జనరేటర్పై డ్రోన్ దాడి జరగడంతో ఆ ప్రాంగణ పరిసరాల్లో మంటలు చెలరేగాయి. అయితే ఈ దాడికి ఇప్పటివరకు ఎవరు బాధ్యత వహించలేదని, డ్రోన్ దాడి ఎక్కడి నుండి జరిగిందనే మూలాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు యుఎఇ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్–ముంబై బుల్లెట్ ట్రైన్ రూట్ ఇదే..
- యూఏఈ దాడి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
- ఇరాక్ నుంచి వచ్చిన మూడు డ్రోన్లను కూల్చివేసిన సౌదీ అరేబియా
- కె.ఎల్.రావు వర్దంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు
- కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం
- ఇక నుంచి వారంలో నాలుగు రోజులే పనిదినాలు..
- అమెరికా: గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు
- ఒమన్ లో 25 శాతం పెరిగిన కూరగాయల ధరలు..!!
- బహ్రెయిన్-కువైట్ భద్రతా సహకారం బలోపేతం..!!
- పిరికిపంద ఉగ్రవాద దాడి..ఐఏఈఏ చీఫ్ తో యూఏఈ విదేశాంగ మంత్రి..!!









