యూఏఈ దాడి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
- May 18, 2026
యూఏఈలోని ఏకైక అణువిద్యుత్ కేంద్రం ‘బారాక్’ లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిపై భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ దాడి జరగడం ప్రమాదకరమైన పరిణామమని అభివర్ణిస్తూ సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. యుఎఇలోని అణుకేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ఇటువంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని, ఇవి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తాయని భారత్ పేర్కొంది. సంబంధిత పక్షాలన్నీ సంయమనం పాటించాలని, తక్షణమే దౌత్యం, చర్చల మార్గానికి తిరిగి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. కాగా, గల్ఫ్ దేశంలోని ఏకైక అణు విద్యుత్ కేంద్రమైన బారాక్ సమీపంలో ఒక జనరేటర్పై డ్రోన్ దాడి జరగడంతో ఆ ప్రాంగణ పరిసరాల్లో మంటలు చెలరేగాయి. అయితే ఈ దాడికి ఇప్పటివరకు ఎవరు బాధ్యత వహించలేదని, డ్రోన్ దాడి ఎక్కడి నుండి జరిగిందనే మూలాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు యుఎఇ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







