కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- May 18, 2026
కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన దుబారే ఎలిఫెంట్ క్యాంపు లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉల్లాసంగా గడపడానికి వచ్చిన పర్యాటకుల కళ్ల ముందే ఒక భయానక ప్రమాదం జరిగి, ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. కొడగు జిల్లాలోని ఏనుగుల శిబిరంలో రెండు ఏనుగులు పరస్పరం గొడవ పడుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
దుబారే శిబిరంలోని ఏనుగులకు మావటీలు కొలనులో స్నానం చేయిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ చాలా మంది పర్యాటకులు కూడా ఉన్నారు. అయితే, అకస్మాత్తుగా రెండు ఏనుగుల మధ్య తేడా రావడంతో అవి ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ తీవ్రంగా ఘర్షణకు దిగాయి. భారీ కాయాలు కలిగిన ఆ రెండు ఏనుగులు గొడవ పడటం చూసి అక్కడున్న పర్యాటకులు భయాందోళనతో చెల్లాచెదురుగా పరుగులు తీశారు.
పర్యాటకురాలి పై పడిపోయిన ఏనుగు
ఈ ఘర్షణలో ఒక ఏనుగు అదుపుతప్పి ఒక్కసారిగా పర్యాటకులు పరిగెడుతున్న వైపు దూసుకొచ్చింది. క్యాంప్ సందర్శనకు వచ్చిన ఒక మహిళా పర్యాటకురాలిపై ఆ ఏనుగు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి పర్యాటకులు, జైలు సిబ్బంది వెంటనే ఆమెను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆమె పరిస్థితి విషమించి మృతి చెందినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు.
తాజా వార్తలు
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- అంకిత భావంతో ప్రజలకు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









