కర్ణాటక దుబారే క్యాంప్‌లో విషాదం..

- May 18, 2026 , by Maagulf
కర్ణాటక దుబారే క్యాంప్‌లో విషాదం..

కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన దుబారే ఎలిఫెంట్ క్యాంపు లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎంతో ఉల్లాసంగా గడపడానికి వచ్చిన పర్యాటకుల కళ్ల ముందే ఒక భయానక ప్రమాదం జరిగి, ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. కొడగు జిల్లాలోని ఏనుగుల శిబిరంలో రెండు ఏనుగులు పరస్పరం గొడవ పడుతున్న సమయంలో జరిగిన ఈ ప్రమాదం పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

దుబారే శిబిరంలోని ఏనుగులకు మావటీలు కొలనులో స్నానం చేయిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ చాలా మంది పర్యాటకులు కూడా ఉన్నారు. అయితే, అకస్మాత్తుగా రెండు ఏనుగుల మధ్య తేడా రావడంతో అవి ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటూ తీవ్రంగా ఘర్షణకు దిగాయి. భారీ కాయాలు కలిగిన ఆ రెండు ఏనుగులు గొడవ పడటం చూసి అక్కడున్న పర్యాటకులు భయాందోళనతో చెల్లాచెదురుగా పరుగులు తీశారు.

పర్యాటకురాలి పై పడిపోయిన ఏనుగు

ఈ ఘర్షణలో ఒక ఏనుగు అదుపుతప్పి ఒక్కసారిగా పర్యాటకులు పరిగెడుతున్న వైపు దూసుకొచ్చింది. క్యాంప్ సందర్శనకు వచ్చిన ఒక మహిళా పర్యాటకురాలిపై ఆ ఏనుగు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తోటి పర్యాటకులు, జైలు సిబ్బంది వెంటనే ఆమెను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆమె పరిస్థితి విషమించి మృతి చెందినట్లు అధికారులు అధికారికంగా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com