#చిరు158 చిత్రానికి సినిమాటోగ్రాఫర్గా విజయ్ కార్తిక్ కన్నన్
- May 18, 2026
మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్బస్టర్ వాల్తేర్ వీరయ్య తర్వాత మరో మాస్ ఎంటర్టైనర్ కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లితో మరోసారి జతకడుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #చిరుబాబీ2 / #చిరు158 మే 21న అధికారికంగా ప్రారంభం కానుంది.
ఇప్పుడు మేకర్స్ టీమ్లోకి మరో బలమైన టెక్నికల్ టాలెంట్ను తీసుకొచ్చారు. ‘జైలర్’, ‘డాకూ మహారాజ్’, అలాగే రాబోయే ‘జైలర్ 2’ చిత్రాలతో తన విజువల్ స్టైల్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ ఈ చిత్రానికి డీవోపీగా అధికారికంగా జాయిన్ అయ్యారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేయడంతో ఈ అప్డేట్ మరింత స్పెషల్గా మారింది. గతంలో బాబీ కొల్లితో కలిసి పని చేసిన విజయ్ కార్తిక్ కన్నన్, ఈసారి కూడా తన ప్రత్యేక విజువల్ టచ్తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు.
ఇప్పటికే విడుదలైన లుక్ టెస్ట్ ఇమేజెస్, అనౌన్స్మెంట్ పోస్టర్, అలాగే చిరంజీవి జిమ్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో ఆయన కొత్త స్టైలిష్ అవతార్పై భారీ ఆసక్తిని పెంచాయి.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ను గ్రాండ్గా తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న బాబీ కొల్లి, ఈసారి చిరంజీవిని ఇప్పటివరకు చూడని అత్యంత పవర్ఫుల్ అవతార్లో చూపించబోతున్నారు. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ను మరింత ఎలివేట్ చేసేలా రూపొందుతున్న ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, హై వోల్టేజ్ ఎలివేషన్స్, థియేటర్లను షేక్ చేసే మాస్ మూమెంట్స్తో ఉండబోతోంది.
ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బాబీ కొల్లి
ప్రొడక్షన్ బ్యానర్: KVN ప్రొడక్షన్స్
నిర్మాత: వెంకట్ కె నారాయణ
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









