ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- July 18, 2026
దోహా: ఇరాన్ ఖతార్తో పాటు జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ భూభాగాలపై జరిపిన తాజా దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఆయా దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై జరిగిన బహిరంగ ఉల్లంఘన అని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్, పొరుగు దేశాలతో సత్సంబంధాల సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయని ఖతార్ ఆరోపించింది. ఇలాంటి చర్యలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచడంతో పాటు, శాంతి భద్రత కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తాయని తెలిపింది.
ఈ దాడులకు, వాటి వల్ల కలిగే పరిణామాలకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇరానే పూర్తి బాధ్యత వహించాలని ఖతార్ స్పష్టం చేసింది. అలాగే, ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం తమ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని వెల్లడించింది.
అంతేకాకుండా, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ దేశాలకు ఖతార్ తన సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఆయా దేశాలు తమ భద్రత కోసం చేపట్టే చట్టబద్ధమైన చర్యలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది. ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే అన్ని సైనిక చర్యలను వెంటనే నిలిపివేసి, అన్ని పక్షాలు సంయమనం పాటిస్తూ చర్చలు, దౌత్య మార్గానికే తిరిగి రావాలని ఖతార్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







