అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- July 18, 2026
మస్కట్: ఒమన్లోని ధోఫార్ గవర్నరేట్కు చెందిన సలాలా నగరానికి దక్షిణంగా అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో మోస్తరు భూకంపం నమోదైంది. గురువారం సాయంత్రం 4:01 గంటలకు భూకంపం సంభవించినట్లు సుల్తాన్ ఖాబూస్ యూనివర్సిటీ భూకంప పర్యవేక్షణ కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం సలాలాకు సుమారు 239 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదని పేర్కొన్నారు. భూకంప ప్రభావం జనావాస ప్రాంతాలపై పడలేదని అధికారులు స్పష్టం చేశారు. భూకంప పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని అధికారులు సూచించారు
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







