అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- May 20, 2026
కువైట్ః దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో అస్తవ్యస్తంగా పార్కింగ్ చేసే సమస్యను పరిష్కరించడానికి, కువైట్ క్యాబినెట్ షేక్ ఫహద్ అల్-యూసెఫ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ గవర్నరేట్లలోని ప్రాంగణాలు, పాఠశాలల పార్కింగ్ ప్రాంతాలు, మసీదుల పరిసరాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో వాహనాలు, భారీ పరికరాలు మరియు యంత్రాలను నియంత్రణ లేకుండా పార్కింగ్ చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలిపింది. ఇది ట్రాఫిక్ మరియు పర్యావరణ సవాళ్లను కూడా సృష్టిస్తుందని, వీటికి తక్షణ ప్రభుత్వ జోక్యం అవసరమని హెచ్చరించింది.
ఈ కమిటీలో ప్రజా పనులు, పురపాలక వ్యవహారాలు మరియు గృహనిర్మాణం, ఆర్థిక వ్యవహారాలు మరియు పెట్టుబడులు మరియు ఆర్థిక శాఖల మంత్రులు ఉన్నారు. పార్కింగ్ కోసం స్థలాలను ఇష్టానుసారంగా ఉపయోగించడం వల్ల ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. మల్టీ ఫ్లోర్ పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా కూడా ఈ కమిటీ కృషి చేస్తుందన్నారు. ఈ సమస్యపై తీసుకున్న చర్యలు మరియు సాధించిన పురోగతిని వివరిస్తూ, ప్రతి రెండు నెలలకు ఒకసారి క్యాబినెట్కు ఒక నివేదికను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- జాతీయ, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు..!!









