అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- May 20, 2026
కువైట్ః దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో అస్తవ్యస్తంగా పార్కింగ్ చేసే సమస్యను పరిష్కరించడానికి, కువైట్ క్యాబినెట్ షేక్ ఫహద్ అల్-యూసెఫ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ గవర్నరేట్లలోని ప్రాంగణాలు, పాఠశాలల పార్కింగ్ ప్రాంతాలు, మసీదుల పరిసరాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో వాహనాలు, భారీ పరికరాలు మరియు యంత్రాలను నియంత్రణ లేకుండా పార్కింగ్ చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలిపింది. ఇది ట్రాఫిక్ మరియు పర్యావరణ సవాళ్లను కూడా సృష్టిస్తుందని, వీటికి తక్షణ ప్రభుత్వ జోక్యం అవసరమని హెచ్చరించింది.
ఈ కమిటీలో ప్రజా పనులు, పురపాలక వ్యవహారాలు మరియు గృహనిర్మాణం, ఆర్థిక వ్యవహారాలు మరియు పెట్టుబడులు మరియు ఆర్థిక శాఖల మంత్రులు ఉన్నారు. పార్కింగ్ కోసం స్థలాలను ఇష్టానుసారంగా ఉపయోగించడం వల్ల ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. మల్టీ ఫ్లోర్ పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా కూడా ఈ కమిటీ కృషి చేస్తుందన్నారు. ఈ సమస్యపై తీసుకున్న చర్యలు మరియు సాధించిన పురోగతిని వివరిస్తూ, ప్రతి రెండు నెలలకు ఒకసారి క్యాబినెట్కు ఒక నివేదికను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







