ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- May 20, 2026
మస్కట్: వ్యక్తుల వ్యక్తిగత లేదా కుటుంబ జీవితానికి సంబంధించిన వార్తలు, ఫోటోలు లేదా వ్యాఖ్యలను వారి అనుమతి లేకుండా ప్రచురించడం నేరమని ఒమన్ సుల్తానేట్లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. తన ‘#MissingLink ప్రచారం’లో భాగంగా జారీ చేసిన ఒక ప్రకటనలో.. సంబంధిత వ్యక్తుల ఆమోదం లేకుండా అటువంటి సమాచారాన్ని పంచుకుంటే ఏడాది వరకు జైలు శిక్ష పడొచ్చని పేర్కొంది. వివిధ రకాల ప్రచురణల ద్వారా వ్యక్తిగత గోప్యత మరియు కుటుంబ జీవిత ఉల్లంఘనలను నేరంగా పరిగణించే శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 330ను ఈ సంస్థ ఉదహరించింది.
గోప్యతా హక్కులను గౌరవించడంపై అవగాహన కల్పించడం, సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్ఫారమ్లను బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ ప్రచారం లక్ష్యం. డిజిటల్ బెదిరింపులు ఒమన్ సైబర్క్రైమ్ చట్టం ప్రకారం నేరమని తెలిపింది.వ్యక్తులను బెదిరించడానికి లేదా వారి నుండి డబ్బు వసూలు చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలనుసంస్థ హైలైట్ చేసింది. ప్రైవసిని పరిరక్షించడానికి కఠినమైన శిక్షలు అమలులో ఉన్నాయని కూడా పేర్కొంది.
తాజా వార్తలు
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- జాతీయ, ప్రజల భద్రతకు పటిష్ఠ చర్యలు..!!
- దోహా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనను సందర్శించిన షేఖా మోజా..!!









