ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- May 20, 2026
మస్కట్: వ్యక్తుల వ్యక్తిగత లేదా కుటుంబ జీవితానికి సంబంధించిన వార్తలు, ఫోటోలు లేదా వ్యాఖ్యలను వారి అనుమతి లేకుండా ప్రచురించడం నేరమని ఒమన్ సుల్తానేట్లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. తన ‘#MissingLink ప్రచారం’లో భాగంగా జారీ చేసిన ఒక ప్రకటనలో.. సంబంధిత వ్యక్తుల ఆమోదం లేకుండా అటువంటి సమాచారాన్ని పంచుకుంటే ఏడాది వరకు జైలు శిక్ష పడొచ్చని పేర్కొంది. వివిధ రకాల ప్రచురణల ద్వారా వ్యక్తిగత గోప్యత మరియు కుటుంబ జీవిత ఉల్లంఘనలను నేరంగా పరిగణించే శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 330ను ఈ సంస్థ ఉదహరించింది.
గోప్యతా హక్కులను గౌరవించడంపై అవగాహన కల్పించడం, సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్ఫారమ్లను బాధ్యతాయుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ ప్రచారం లక్ష్యం. డిజిటల్ బెదిరింపులు ఒమన్ సైబర్క్రైమ్ చట్టం ప్రకారం నేరమని తెలిపింది.వ్యక్తులను బెదిరించడానికి లేదా వారి నుండి డబ్బు వసూలు చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలనుసంస్థ హైలైట్ చేసింది. ప్రైవసిని పరిరక్షించడానికి కఠినమైన శిక్షలు అమలులో ఉన్నాయని కూడా పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







