రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ

- May 20, 2026 , by Maagulf
రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ

రోమ్: ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్న భారత ప్రతినిధికి అక్కడ ఆత్మీయ స్వాగతం లభించింది. రోమ్ చేరుకున్న అనంతరం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో విందు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం కొలొస్సియంను సందర్శించారు.

ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. భారత్-ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, గ్లోబల్ అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

నేడు జరగనున్న అధికారిక సమావేశాల్లో భారత్-ఇటలీ స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు కొనసాగనున్నట్లు వెల్లడించారు.

ఇటలీ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com