హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- May 20, 2026
రియాద్: హజ్ అనుమతులు లేకుండా 13 మంది యాత్రికులను మక్కాకు తరలించడం ద్వారా హజ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, నలుగురు ప్రవాసులకు మరియు ముగ్గురు సౌదీ పౌరులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది. మక్కా ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా దళాలు వారిని పట్టుకున్నాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హజ్ నిబంధనలు ఉల్లంఘించిన ఎవరికైనా SR100,000 వరకు జరిమానాలు, జైలు శిక్ష విధిస్తారని హెచ్చరించింది.
అనుమతి లేకుండా హజ్ యాత్ర చేసేందుకు ప్రయత్నించేవారికి 20,000 సౌదీ రియాల్స్ వరకు జరిమానాలు విధిస్తారు. ప్రవాసులను దేశం నుండి బహిష్కరించడంతోపాటు శిక్షాకాలం పూర్తయ్యాక తిరిగి ప్రవేశించకుండా 10 సంవత్సరాల పాటు నిషేధం విధిస్తారని అధికారులు తెలిపారు. దీంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారిని రవాణా చేయడానికి ఉపయోగించిన వాహనాలను జప్తు చేస్తారని హెచ్చరించింది. హజ్ నిబంధనలు మరియు సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ పౌరులు మరియు నివాసితులందరికీ మరోసారి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









