హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- May 20, 2026
రియాద్: హజ్ అనుమతులు లేకుండా 13 మంది యాత్రికులను మక్కాకు తరలించడం ద్వారా హజ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, నలుగురు ప్రవాసులకు మరియు ముగ్గురు సౌదీ పౌరులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ జరిమానా విధించింది. మక్కా ప్రవేశ ద్వారాల వద్ద భద్రతా దళాలు వారిని పట్టుకున్నాయని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హజ్ నిబంధనలు ఉల్లంఘించిన ఎవరికైనా SR100,000 వరకు జరిమానాలు, జైలు శిక్ష విధిస్తారని హెచ్చరించింది.
అనుమతి లేకుండా హజ్ యాత్ర చేసేందుకు ప్రయత్నించేవారికి 20,000 సౌదీ రియాల్స్ వరకు జరిమానాలు విధిస్తారు. ప్రవాసులను దేశం నుండి బహిష్కరించడంతోపాటు శిక్షాకాలం పూర్తయ్యాక తిరిగి ప్రవేశించకుండా 10 సంవత్సరాల పాటు నిషేధం విధిస్తారని అధికారులు తెలిపారు. దీంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారిని రవాణా చేయడానికి ఉపయోగించిన వాహనాలను జప్తు చేస్తారని హెచ్చరించింది. హజ్ నిబంధనలు మరియు సూచనలను పాటించాలని మంత్రిత్వ శాఖ పౌరులు మరియు నివాసితులందరికీ మరోసారి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ చమురు క్షేత్రంపై దాడి.. పరామర్శించిన మినిస్టర్..!!
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..







