ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- May 20, 2026
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం భారీ ఊరటను ప్రకటించింది. ఇకపై సాధారణ బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ ఖాతాను సులభంగా వాడుకునే సదుపాయాన్ని తీసుకువస్తోంది. అత్యవసర సమయాల్లో పీఎఫ్ నిధులను విత్డ్రా చేసుకోవడానికి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా యూపీఐ పేమెంట్ గేట్వే ద్వారా నిమిషాల్లో సొమ్మును తీసుకునే రోజులు రాబోతున్నాయి. పీఎఫ్ సొమ్ములో కొంత మొత్తాన్ని ఖాతాల్లో నిల్వ చేసుకుని, ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకునే విధంగా కార్మికశాఖ నూతన విధానాన్ని రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తిచేసినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి మాండవీయా మంగళవారం ప్రకటించారు. చందాదారులు ఇక నుంచి గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ తరహాలోనే..సభ్యులు తమ లింక్డ్ బ్యాంక్ ఖాతా ద్వారా పీఎఫ్ బ్యాలెన్సును చూసుకోవడంతో పాటు యూపీఐ పిన్ ఉపయోగించి సురక్షితంగా నిధులను విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా వచ్చిన డబ్బును నేరుగా డిజిటల్ పేమెంట్లకు లేదా ఏటీఎం ద్వారా నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. ఇదిలా ఉండగా, సభ్యులకు మరింత చేరువకావడానికి ఈపీఎ్ఫవో నెలరోజుల్లో వాట్సాప్ సేవలను ప్రారంభించనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







