ఈద్ అల్ అధా సందర్భంగా 230 మంది ఖైదీలకు అజ్మాన్ రూలర్ క్షమాభిక్ష
- May 21, 2026
అజ్మాన్: ఈద్ అల్ అధా పండుగ సందర్భంగా అజ్మాన్ పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు హిజ్ హైనెస్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నుఐమీ 230 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు.
అజ్మాన్లోని శిక్షా మరియు సంస్కరణ కేంద్రాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో మంచి ప్రవర్తన కనబరిచిన వారిని విడుదల చేయాలని ఆయన ఆదేశించారు.
ఈ మానవతా నిర్ణయం ద్వారా ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం కల్పించడంతో పాటు వారి కుటుంబాలపై ఉన్న భారం తగ్గించాలన్నదే లక్ష్యమని అధికారులు తెలిపారు.
అజ్మాన్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుఐమీ ఈ సందర్భంగా అజ్మాన్ పాలకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షమాభిక్ష ఖైదీలకు తమ కుటుంబాలతో మళ్లీ కలుసుకునే అవకాశం కల్పించి, సమాజానికి సానుకూలంగా సేవ చేసే దిశగా ప్రోత్సహిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఖైదీల విడుదలకు సంబంధించిన ప్రక్రియలను వెంటనే ప్రారంభించనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







