తమిళనాడులో విజయ్ క్యాబినెట్ విస్తరణ..21మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్..
- May 21, 2026
చెన్నై: తమిళనాడులో టీవీకే విజయ్ క్యాబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గంలో 23మంది ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. వీరిలో టీవీకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షమైన కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులచేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మే10వ తేదీన జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తొమ్మిది మంది టీవీకే ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో విజయ్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 32కు చేరింది. మొత్తం 35మంది కేబినెట్లో మంత్రులుగా ఉండొచ్చు. ఇంకా మరో ముగ్గురిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం జరిగిన మంత్రివర్గం విస్తరణంలో వీసీకే, ఐయూఎంఎల్ భాగస్వామ్యం కాలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రెండు మంత్రి పదవులు దక్కాయి. అయితే, ప్రస్తుతం ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్లను సంకీర్ణ మంత్రివర్గంలో లాంఛనంగా చేరాలని టీవీకే నాయకత్వం ఆహ్వానిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో టీవీకే, ఐయూఎంఎల్ పార్టీలకు దక్కే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- రాజీవ్ గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు: సీఎం రేవంత్ రెడ్డి
- తమిళనాడులో విజయ్ క్యాబినెట్ విస్తరణ..21మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్..
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’.. అసలు ఎలా ప్రారంభమైంది?
- పదేళ్లలో 100 కొత్త ఎయిర్పోర్టులు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
- ఈద్ అల్ అధా సందర్భంగా 230 మంది ఖైదీలకు అజ్మాన్ రూలర్ క్షమాభిక్ష
- బాల్య వివాహాలను ప్రేరేపించినందుకు జైలు శిక్ష, Dh5 మిలియన్ల జరిమానా..!!
- గుండెపోటు.. నలుగురు హజ్ యాత్రికులు రక్షించిన వైద్య బృందాలు..!!
- యూఏఈ లాటరీ డ్రా..విజేత IDలు ఇవే..!!
- మానవ అక్రమ రవాణా కేసులో ఆసియా మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఈద్ అల్ అధాకు భారతీయ మేకలకు డిమాండ్..!!









