తమిళనాడులో విజయ్ క్యాబినెట్ విస్తరణ..21మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్..
- May 21, 2026
చెన్నై: తమిళనాడులో టీవీకే విజయ్ క్యాబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గంలో 23మంది ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. వీరిలో టీవీకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షమైన కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులచేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మే10వ తేదీన జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తొమ్మిది మంది టీవీకే ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో విజయ్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 32కు చేరింది. మొత్తం 35మంది కేబినెట్లో మంత్రులుగా ఉండొచ్చు. ఇంకా మరో ముగ్గురిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం జరిగిన మంత్రివర్గం విస్తరణంలో వీసీకే, ఐయూఎంఎల్ భాగస్వామ్యం కాలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రెండు మంత్రి పదవులు దక్కాయి. అయితే, ప్రస్తుతం ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్లను సంకీర్ణ మంత్రివర్గంలో లాంఛనంగా చేరాలని టీవీకే నాయకత్వం ఆహ్వానిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో టీవీకే, ఐయూఎంఎల్ పార్టీలకు దక్కే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







