తమిళనాడులో విజయ్ క్యాబినెట్ విస్తరణ..21మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్..
- May 21, 2026
చెన్నై: తమిళనాడులో టీవీకే విజయ్ క్యాబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గంలో 23మంది ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. వీరిలో టీవీకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షమైన కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులచేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మే10వ తేదీన జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తొమ్మిది మంది టీవీకే ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో విజయ్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 32కు చేరింది. మొత్తం 35మంది కేబినెట్లో మంత్రులుగా ఉండొచ్చు. ఇంకా మరో ముగ్గురిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం జరిగిన మంత్రివర్గం విస్తరణంలో వీసీకే, ఐయూఎంఎల్ భాగస్వామ్యం కాలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రెండు మంత్రి పదవులు దక్కాయి. అయితే, ప్రస్తుతం ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్లను సంకీర్ణ మంత్రివర్గంలో లాంఛనంగా చేరాలని టీవీకే నాయకత్వం ఆహ్వానిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో టీవీకే, ఐయూఎంఎల్ పార్టీలకు దక్కే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







