ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- July 12, 2026
మస్కట్: ఒమాన్లోని ముసందమ్ గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగినట్లు ఆ దేశ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనను ఒమాన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది.
ఒక భద్రతా అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ముసందమ్ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల పై డ్రోన్లతో దాడి జరిగినట్లు నిర్ధారించారు. అయితే దాడుల వల్ల జరిగిన నష్టం లేదా ప్రాణనష్టం గురించి అధికారులు ఇప్పటి వరకు వివరాలు వెల్లడించలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో దేశ భద్రతను బలోపేతం చేసేందుకు, ప్రజలు మరియు దేశంలో నివసిస్తున్న వారందరి రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఒమాన్ ప్రభుత్వం ప్రకటించింది.
దాడి వెనుక ఉన్న కారణాలు, బాధ్యులపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







