ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- July 12, 2026
మస్కట్: ఒమాన్లోని ముసందమ్ గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగినట్లు ఆ దేశ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనను ఒమాన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది.
ఒక భద్రతా అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ముసందమ్ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల పై డ్రోన్లతో దాడి జరిగినట్లు నిర్ధారించారు. అయితే దాడుల వల్ల జరిగిన నష్టం లేదా ప్రాణనష్టం గురించి అధికారులు ఇప్పటి వరకు వివరాలు వెల్లడించలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో దేశ భద్రతను బలోపేతం చేసేందుకు, ప్రజలు మరియు దేశంలో నివసిస్తున్న వారందరి రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఒమాన్ ప్రభుత్వం ప్రకటించింది.
దాడి వెనుక ఉన్న కారణాలు, బాధ్యులపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







