యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- July 12, 2026
అబూదాబి: యూఏఈ సరిహద్దుల వెలుపల ఈ ఉదయం కొన్ని క్షిపణుల కదలికలు గుర్తించినప్పటికీ, దేశంలో ఎలాంటి ప్రమాద పరిస్థితి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అధికారిక ప్రకటనలో, గుర్తించిన క్షిపణి ముప్పు యూఏఈ భూభాగం వెలుపలే ఉన్నట్లు నిర్ధారించిన అధికారులు, ప్రస్తుతం దేశంలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా, స్థిరంగా ఉందని తెలిపారు.
ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, భద్రతా సంస్థలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రాంతీయ పరిణామాల పై సంబంధిత సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయని, అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలని యూఏఈ అధికారులు సూచించారు.

తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







