ఢిల్లీలో మండుతున్న ఎండలు
- May 23, 2026
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో భానుడు భగభగలాడుతున్నాడు. తూర్పు ఢిల్లీలోని నంద్ నగరి ప్రాంతంలో తారు రోడ్ల ఉపరితల ఉష్ణోగ్రత ఏకంగా 65°C నమోదైనట్లు తాజా పరిశీలనల్లో వెల్లడైంది. ప్రఖ్యాత పర్యావరణ సంస్థ ‘గ్రీన్పీస్ ఇండియా’ సహకారంతో, థర్మల్ కెమెరాలు మరియు అత్యాధునిక టెంపరేచర్ మీటర్లతో క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరీక్షల్లో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
యాప్స్లో ఒకలా.. వాస్తవంలో మరోలా!
ప్రస్తుతం ఢిల్లీలో సాధారణ ఉష్ణోగ్రతలు మరియు ఉపరితల ఉష్ణోగ్రతల మధ్య భూగర్భ వ్యత్యాసం కనిపిస్తోంది.
యాప్స్ రీడింగ్: మొబైల్ వెదర్ యాప్స్ ఢిల్లీలో 42°C ఉష్ణోగ్రత ఉన్నట్లు చూపిస్తున్నాయి.
వాస్తవ గాలి ఉష్ణోగ్రత: కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవ గాలి ఉష్ణోగ్రత (Air Temperature) ఏకంగా 48°Cగా రికార్డైంది.
చెట్టు నీడ మహిమ: అదే నంద్ నగరి ప్రాంతంలో రోడ్డుపై 65°C ఉండగా.. పక్కనే ఉన్న చెట్టు నీడలో ఉష్ణోగ్రతను పరీక్షించగా అది ఒక్కసారిగా 40°Cకి పడిపోవడం గమనార్హం. కాంక్రీట్ అడవులుగా మారుతున్న నగరాల్లో పచ్చదనం ఎంత అవసరమో ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.
చిన్నపిల్లలు, వృద్ధులకు పొంచి ఉన్న ముప్పు
ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న ఈ హీట్ వేవ్స్ (ఎండతీవ్రత) కారణంగా ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీలు తీవ్ర ఆరోగ్య ప్రమాదంలో ఉన్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తారు రోడ్ల నుంచి వచ్చే వేడి తరంగాల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. పట్టణీకరణ కారణంగా ఏర్పడుతున్న ‘అర్బన్ హీట్ ఐలాండ్’ ప్రభావం వల్లే ఢిల్లీలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని గ్రీన్పీస్ ఇండియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







