దోహాలో బిజినెస్ మీట్‌లో పాల్గొన్న ఏపీ మంత్రి పార్థసారథి

- May 23, 2026 , by Maagulf
దోహాలో బిజినెస్ మీట్‌లో పాల్గొన్న ఏపీ మంత్రి పార్థసారథి

దోహా: ఖతార్ రాజధాని దోహాలో నిర్వహించిన బిజినెస్ మీట్‌లో ఆంధ్రప్రదేశ్ మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వ్యాపార అవకాశాలపై ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనుకూల విధానాలు మరియు పెట్టుబడిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.

దోహాలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులతో మంత్రి సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com