తెలంగాణ పోలీసింగ్‌లో ఏఐ వినియోగానికి కార్యాచరణ: డీజీపీ సీవీ ఆనంద్

- May 23, 2026 , by Maagulf
తెలంగాణ పోలీసింగ్‌లో ఏఐ వినియోగానికి కార్యాచరణ: డీజీపీ సీవీ ఆనంద్

--స్మార్ట్ పోలీసింగ్ కోసం ప్రత్యేక టెక్ టీమ్ ఏర్పాటు దిశగా చర్చలు

హైదరాబాద్: తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థను మరింత స్మార్ట్‌గా, సాంకేతికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక చర్యలు చేపడుతోంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఆధునిక సాంకేతికతను పోలీసింగ్‌లో విస్తృతంగా వినియోగించే అంశాలపై చర్చించారు. పోలీస్ సేవలను వేగవంతం చేయడం, నేరాల విచారణను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, డేటా ఆధారిత నిర్ణయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రత్యేక టెక్ టీమ్‌ను ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

అదేవిధంగా ప్రస్తుతం అమల్లో ఉన్న CCTNS (Crime and Criminal Tracking Network System), HRMS (Human Resource Management System), Hawkeye వంటి వ్యవస్థలను పరస్పరం అనుసంధానం చేసి సమగ్ర డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థగా అభివృద్ధి చేసే అంశంపై అధికారులు చర్చించారు.

పోలీస్ శాఖలో సాంకేతికత వినియోగాన్ని పెంచడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com