దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!

- May 25, 2026 , by Maagulf
దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!

ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో అధిక శాతం బయట నుంచే ఉన్నా యని,కేంద్ర ఆర్థిక మం త్రి నిర్మలా సీతారామన్, వెల్లడించారు. బంగారం, ఇంధనం, దిగుమతి కోసం విదేశీ మారకద్రవ్య అవసరా ల వంటివే ఉన్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితిపై నిరాశా వాదలు తప్పుడు ప్రచారం చేయడానికి కొందరు ప్రయత్ని స్తున్నారని విమర్శిం చారు.

ప్రస్తుతం అంతర్జాతీ యంగా తీవ్రమైన బాహ్య సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భారతదేశ ఆర్థిక పునాదులు అత్యంత సానుకూలంగా, పటిష్టంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం 37వ ఎస్ ఐ డి బి ఐ  ఫౌండేషన్ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ, పాల్గొని మాట్లాడారు.

పశ్చిమాసియా,సంక్షో భం రేపిన అనిశ్చితి వల్ల వ్యాపారాల ప్రభావం ప్రజలపై పడుతున్న ప్రభావాన్ని సుదీర్ఘంగా విశ్లేషించా రు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో పౌరుల ను రక్షించడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎం ఎస్ ఎం ఈ లు పూర్తి మద్ద తు ఇవ్వడం, సరఫరా గొలుసులను కాపాడ టమే ప్రభుత్వ ప్రధాన విధానమని ఆమె పునరుద్ఘాటించారు.

దేశాన్ని వేధిస్తున్న మూడు ప్రధాన ఒత్తిడి పాయింట్లు 3 'F's, అంతర్జాతీయ ముడి చమురు ధరలు గత 80-90 రోజులుగా తీవ్రమైన హెచ్చుతగ్గు లకు లోనవుతున్నా యని, ఈ కారణంగానే విదేశీ మారక ద్రవ్యా న్నిఆదా చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ ప్రజలకు పిలుపునిచ్చారని మంత్రి వివరించారు. భారత్‌కు ప్రస్తుతం మూడు బాహ్య సవాళ్లు ప్రధాన ఒత్తిడి పాయింట్లుగా మారాయని ఆమె పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com