స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- July 18, 2026
హైదరాబాద్: భారత్ ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. దీంతో భారతీయ అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం మొదలైంది. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఇవాళ శ్రీహరికోట నుంచి విక్రమ్1 రాకెట్ను నింగిలోకి పంపింది. 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ కక్ష్యలోకి ఆ రాకెట్ విజయవంతంగా తన పేలోడ్స్ను తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తన ఎక్స్ అకౌంట్లో రియాక్ట్ అయ్యింది. హల్లో స్పేస్.. మేం వచ్చేశాం అంటూ ట్వీట్ చేసింది. విక్రమ్1 పరీక్ష విజయవంతమైనట్లు తన పోస్టులో ఆ కంపెనీ వెల్లడించింది. భారతదేశం ప్రయోగించిన తొలి ప్రైవేటు రాకెట్ విజయవంతంగా తన మిషన్ పూర్తి చేసినట్లు ఆ ట్వీట్లో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నింగిలోకి ప్రైవేటు రాకెట్ పంపే సామర్థ్యం ఉన్న మూడవ దేశంగా ఇండియా నిలిచినట్లు స్కైరూట్ సంస్థ తన పోస్టులో పేర్కొన్నది. చరిత్ర సృష్టించినట్లు చెప్పింది.
విక్రమ్1 రాకెట్ పేలోడ్తో పాటు బెస్ట్ విషెస్ చెబుతూ ప్రధానితో పాటు అనేక మంది రాసిన లేఖలను కూడా నింగిలోకి మోసుకెళ్లింది. మిషన్ ఆగమన్ పేరుతో ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టారు. భారతీయ అంతరిక్ష రంగంలో ఇక ప్రైవేటు ప్రస్థానం కూడా ఇక ప్రయోగంతో మొదలైంది. శ్రీహరికోటలోని ఫస్ట్ ల్యాంచ్ ప్యాడ్ నుంచి ఈ రాకెట్ 12.05 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. వాస్తవానికి 11.30 నిమిషాలకే ఎగరాల్సిన ఆ రాకెట్లో నావిగేషన్ లోపాలు తలెత్తడంతో ప్రయోగాన్ని రీషెడ్యూల్ చేశారు. విక్రమ్1 రాకెట్లో గ్రహ స్పేస్, కాస్మోసర్వ్, డీక్యూబ్డ్, స్కైరూట్ స్కోప్ పేలోడ్స్ ఉన్నాయి. 18 క్యారెట్ల గోల్డ్ రాకెట్ బొమ్మతో పాటు ప్రధాని మోదీ రాసిన వందేమాతరం సందేశ పోస్టు కార్డు కూడా పేలోడ్స్లో ఉన్నాయి. ఇంజినీర్లు, సైంటిస్టులు, ఆస్ట్రోనాట్స్ చెప్పిన విషెస్ లేఖలు కూడా ఉన్నాయి.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







