సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- May 25, 2026
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అటా ప్రతినిధులు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రం అందజేశారు.
జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో నిర్వహించనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ 19వ తెలుగు మహాసభలకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు. తెలుగు సంస్కృతి, భాష పరిరక్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని ఒక వేదికపైకి తీసుకురావడంలో ఈ మహాసభలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రతినిధులు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కో-ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ రీజినల్ కో-ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్
- ట్రైనీ ఐఏఎస్ అధికారులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దిశానిర్దేశం









