సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు

- May 25, 2026 , by Maagulf
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అటా ప్రతినిధులు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రం అందజేశారు.

జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో నిర్వహించనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ 19వ తెలుగు మహాసభలకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు. తెలుగు సంస్కృతి, భాష పరిరక్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని ఒక వేదికపైకి తీసుకురావడంలో ఈ మహాసభలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రతినిధులు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కో-ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ రీజినల్ కో-ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com