యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- May 25, 2026
దుబాయ్: యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిజ్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 2025 సంవత్సరానికి సంబంధించిన ఎమిరేట్స్ టూరిజం కౌన్సిల్ నివేదికను సమీక్షించారు. ఈ సందర్భంగా దేశ పర్యాటక రంగం సాధించిన పురోగతిని అధికారులు వివరించారు.
2025లో యూఏఈ పర్యాటక రంగం స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. హోటళ్లలో బస చేసిన అతిథుల సంఖ్య 3.2 కోట్లకు పైగా చేరి, 2024తో పోలిస్తే 5.1 శాతం పెరిగింది. అలాగే హోటల్ రంగ ఆదాయం AED 49.21 బిలియన్లకు చేరి, గత ఏడాదితో పోలిస్తే 9.7 శాతం వృద్ధి నమోదైంది.
దేశవ్యాప్తంగా 1,240కు పైగా హోటల్ సంస్థల్లో మొత్తం 2.17 లక్షల హోటల్ గదులు అందుబాటులో ఉన్నాయని నివేదిక వెల్లడించింది. హోటల్ ఆక్యుపెన్సీ రేటు 79.5 శాతంగా నమోదై, ప్రాంతీయంగానే కాక ప్రపంచ స్థాయిలో కూడా అత్యుత్తమ స్థాయిలో నిలిచింది. ఇది యూఏఈ పర్యాటక రంగంపై ఉన్న భారీ డిమాండ్ను ప్రతిబింబిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
అలాగే 2025లో హోటల్ నైట్స్ సంఖ్య 10 కోట్లకు చేరడం మరో ముఖ్యమైన విజయంగా నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ (TTDI) 2024లో యూఏఈ మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో తొలి స్థానంలో నిలవగా, ప్రపంచవ్యాప్తంగా 18వ స్థానాన్ని దక్కించుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







