కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి నివాసంలో ఈడీ సోదాలు
- May 27, 2026
కేరళ రాజకీయ వర్గాల్లో బుధవారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో కేరళ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విరుచుకుపడ్డారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు.. కేరళ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 కీలక ప్రాంతాలలో ఏకకాలంలో ఈ మెరుపు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎక్కడెక్కడ సోదాలు సాగుతున్నాయి?
మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. తిరువనంతపురంలోని పినరయి విజయన్ అద్దె ఇల్లు, అలాగే కన్నూరులో ఉన్న ఆయన సొంత నివాసంలో ఉదయం నుంచే సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. విజయన్ ఇళ్లతో పాటు కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (CMRL) ఎండీ శశిధరన్ నివాసం, కేరళ మాజీ మంత్రి మహమ్మద్ రియాజ్ ఇళ్లలోనూ ఈడీ బృందాలు విచారణ జరుపుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ







