మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- July 16, 2026
మనామా: సోషల్ మీడియాలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఓ మహిళకు బహ్రెయిన్ కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించింది. ఆమె ఉపయోగించిన మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకోవాలని లోయర్ క్రిమినల్ కోర్టు ఆదేశించింది.
ఎలక్ట్రానిక్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ విభాగం అధిపతి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తింపు పొందిన ఒక మత శాఖను బహిరంగంగా అవమానిస్తూ, ఆ మతానికి సంబంధించిన ఆచారాలను కించపరిచేలా ఇన్స్టాగ్రామ్లో మహిళ వ్యాఖ్యలు పోస్టు చేసింది. ఈ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టే అవకాశం ఉన్నట్లు ఎలక్ట్రానిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ సోషల్ మీడియా పర్యవేక్షణలో గుర్తించింది.
దర్యాప్తులో ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా యజమానిని గుర్తించిన అధికారులు, కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపించారు. విచారణలో మహిళ తన అకౌంట్ తనదేనని, వివాదాస్పద వ్యాఖ్యను తానే పోస్టు చేసినట్లు అంగీకరించింది.
దీంతో ఆమెను అదుపులోనే సంబంధిత కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఒక నెల జైలు శిక్ష విధించడంతో పాటు, నేరానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకోవాలని తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







