ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- June 02, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ సి.వి.ఆనంద్తో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించి, పరేడ్ను పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం మరియు భవిష్యత్ లక్ష్యాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
వేడుకల్లో భాగంగా విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు, అంకితభావం మరియు విశిష్ట సేవలను కనబరిచిన 17 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి గ్యాలంట్రీ మెడల్స్ను ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. అలాగే ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన ఒక కానిస్టేబుల్కు జీవన్ రక్షా పతక్ అందజేశారు. ఇతర శాఖలకు చెందిన పలువురు సిబ్బందికి కూడా విశిష్ట సేవలకుగాను పురస్కారాలు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న వారందరికీ డీజీపీ సి.వి ఆనంద్ అభినందనలు తెలిపారు. వారి ధైర్యం, త్యాగం, సేవా నిబద్ధత తెలంగాణ పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది ఇదే అంకితభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







