మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి లోకేష్
- June 06, 2026
మాస్కో: ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించారు.ఇందులో భాగంగా అక్కడి ప్రతిష్టాత్మక ‘స్బేర్ సిటీ’ (SberCity)ని సందర్శించిన ఆయన, అక్కడ అందుబాటులో ఉన్న విప్లవాత్మక సాంకేతిక ఆవిష్కరణలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధునిక టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, వాటిని ప్రజాసేవల్లో ఎలా ఉపయోగించవచ్చనే అంశాలపై ఆయన ప్రత్యేక ఆసక్తి కనబరిచారు.
వ్యాధి నిర్ధారణ చేసే ఏటీఎం..లోకేష్ను ఆకర్షించిన సరికొత్త ఆవిష్కరణ!
ఈ పర్యటనలో స్బేర్ బ్యాంక్కు చెందిన ఒక వినూత్న ఏటీఎం (ATM) మంత్రి లోకేష్ను విశేషంగా ఆకర్షించింది. కేవలం డబ్బులు డ్రా చేయడం, బ్యాంకింగ్ సేవలు అందించడమే కాకుండా.. రోగులకు ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగల సామర్థ్యం ఈ ఏటీఎంకు ఉండటం విశేషం. ఈ అద్భుత సాంకేతికత పనిచేసే విధానాన్ని అక్కడి నిపుణులను అడిగి తెలుసుకున్న మంత్రి, వారి ఆవిష్కరణను అభినందించారు.
పీపీటీ ద్వారా పరిశోధనల వివరణ
అనంతరం, స్బేర్ సిటీ ప్రతినిధులు తమ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పరిశోధనలు (R&D), అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ముఖ్యంగా క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ హెల్త్కేర్, సైబర్ సెక్యూరిటీ మరియు డిజిటల్ ఎడ్యుకేషన్ రంగాలలో తాము సాధించిన ప్రగతిని, అందిస్తున్న డిజిటల్ పరిష్కారాలను లోకేష్కు కూలంకషంగా వివరించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







